Header Banner

వైజాగ్ వాసులకు పండగే పండగ.. వచ్చే నెలలోనే..! ఇక ఎంజాయ్!

  Thu May 29, 2025 07:00        Politics

సాగర తీరం విశాఖపట్నం సందర్శించే పర్యాటకులకు, విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు తీయనున్నాయి. అన్నీ అనుకున్నట్లు పూర్తి అయితే.. వచ్చే నెలలోనే డబుల్ డెక్కర్ బస్సుల్లో విశాఖ నగరాన్ని చుట్టేయవచ్చు. విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులు నడిపేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జీవీఎంసీకి తోడు స్టీల్‌ప్లాంట్ కూడా డబుల్ డెక్కర్ బస్సులను నడపటంలో సహకారం అందిస్తోంది. స్టీల్‌ప్లాంట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధులతో ఓ డబుల్ డెక్కర్ బస్సును సమకూరుస్తోంది.

దీనికి అదనంగా మరో రెండు డబుల్ డెక్కర్ బస్సులను నడిపేందుకు జీవీఎంసీ కసరత్తు చేస్తోంది. డబుల్ డెక్కర్ బస్సుల కొనుగోలు కోసం రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ టెండర్లను జీవీఎంసీ ఆహ్వానించింది. జూన్ 10వ తేదీలోగా వీటిలో ఒక్క డబుల్ డెక్కర్ బస్సును అయినా అందుబాటులోకి తెచ్చి.. చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాలని జీవీఎంసీ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు విశాఖను సందర్శించే వారితో పాటుగా.. స్థానికులు కూడా సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా.. రెండు హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను ఏర్పాటు చేసేందుకు జీవీఎంసీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. స్థానికులకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచటంతో పాటుగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రెండు హాప్ ఆన్ హాప్ ఆఫ్ (HOHO) బస్సులను ప్రవేశపెట్టాలని జీవీఎంసీ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (GVSCCL) నిర్ణయించింది. విద్యుత్తుతో నడిచే రెండు డబుల్ డెక్కర్ హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఒక బస్సు ఎయిర్ కండిషన్డ్ కాగా.. మరొకటి నాన్ ఏసీ. ఈ రెండు డబుల్ డెక్కర్ బస్సులను కొనుగోలు చేసేందుకు రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ టెండర్లను జీవీఎస్‌సీసీఎల్ ఆహ్వానిస్తోంది.

ఈ డబుల్ డెక్కర్ బస్సులను విశాఖలోని అన్ని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల మీదుగా నడపాలని జీవీఎంసీ అధికారులు ఆలోచిస్తున్నారు. ఏపీ పర్యాటక శాఖ భాగస్వామ్యంతో జీవీఎంసీ ఈ ప్రాజెక్టు చేపట్టనుంది. విశాఖలోని పర్యాటక ప్రదేశాలను చుట్టేసేలా ఈ డబుల్ డెక్కర్ బస్సులను తీసుకు వస్తే పర్యాటకులకు మరింత అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఒక్కరోజులోనే పర్యాటక ప్రాంతాలను చుట్టేయాలనుకునేవారికి ఈ డబుల్ డెక్కర్ బస్సులు అనుకూలంగా ఉంటాయని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు.

మరోవైపు ఈ డబుల్ డెక్కర్ ఈ బస్సులను ఆర్కే బీచ్‌తో పాటుగా, తొట్లకొండ, టీయూ- 142 , రుషికొండ, తెన్నేటి పార్క్, కైలాసగిరి, సింహాచలం దేవాలయం, భీమిలి బీచ్ మీదుగా నడిపే ఆలోచనలో జీవీఎంసీ అధికారులు ఉన్నారు. అలాగే పర్యాటకులకు ఆ ప్రాంతాల విశేషాలను వివరించేందుకు డబుల్ డెక్కర్ బస్సులో.. గైడ్ లేదా ఆడియో, వీడియో ప్రజెంటేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులు విశాఖపట్నంలో అందుబాటులోకి వస్తే ఒక్క టికెట్‌తో విశాఖలోని టూరిస్ట్ స్పాట్‌లను అన్నింటినీ చుట్టేసి రావచ్చు.

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు


కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?


గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక! ప్రమాదకరమైన లోపాలు గుర్తింపు!


వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ...! అత్యవసర విచారణకు నిరాకరణ!


విశాఖ నుంచి ఈ మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు..!


తీపి క‌బురు చెప్పిన ఫ్లిప్‌కార్ట్..! ఈ ఏడాది 5 వేల ఉద్యోగాల భ‌ర్తీ!


కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు! నాని కుటుంబ సభ్యులు!


కేటీఆర్‌కు ఏసీబీ షాక్..! నోటీసులు జారీ!


విశాఖ విమ్స్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాతపరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #VizagCelebrations #VizagFestivalVibes #GoodNewsForVizag #VizagBuzz #AndhraUpdates #VizagPeopleRejoice